ముంబై: పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ నటి రీతుపర్ణసేన్ గుప్తకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అయితే, కరోనా పాజిటివ్ వచ్చినా తనలో సింప్టమ్స్ ఏమీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం సింగపూర్లో షూటింగ్లో ఉన్న తాను ఇక్కడే ఒక రికవరీ సెంటర్లో క్వారెంటైన్లో ఉన్నానని 50 ఏండ్ల రీతు తెలిపారు.
కరోనా లక్షణాలేమీ లేకున్నా వైద్యుల సూచన మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నానని రీతుపర్ణసేన్ చెప్పారు. తాను, తన కుటుంబం, సిబ్బంది అంతా క్షేమంగానే ఉన్నామని, తన గురించి అభిమానులెవరూ ఆందోళన చెందనవసరం లేదని ఆమె పేర్కొన్నారు.