హీరో కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం ‘బింబిసార’. సంయుక్తా మీనన్, క్యాథరీన్ ట్రెసా నాయికలుగా నటించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై హరికృష్ణ కె నిర్మాణంలో దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు మంచి స్పందన రావడంపై చిత్ర బృందం ఆనందాన్ని వ్యక్తం చేసింది. హైదరాబాద్లోని సంస్థ కార్యాలయంలో సక్సెస్మీట్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ…‘మా బింబిసారుడికి మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్. ఇవాళ విడుదలైన రెండు సినిమాలు బాగున్నాయని చెబుతున్నారు.
కళ్యాణ్ రామ్తో ‘పటాస్’ తర్వాత మళ్లీ మా కాంబినేషన్లో హిట్ వచ్చింది’ అన్నారు. దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ…‘థియేటర్లకు వచ్చి మా చిత్రాన్ని విజయవంతం చేశారు. నాకు ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్కు సక్సెస్ క్రెడిట్ ఇస్తాను’ అన్నారు. హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…‘మంచి సినిమా చేస్తే తప్పకుండా ఆదరిస్తారని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. వాళ్ల రుణం తీర్చుకోలేము. సినిమా హిట్ చేసి మరోసారి మాకు ఊపిరి పోశారు. ఈ విజయంతో మాపై బాధ్యత పెరిగింది. ఇంకా మంచి చిత్రాలు చేసి మీరు చూపించిన ఆదరణను కాపాడుకుంటాం. బింబిసారుడు అంటే కళ్యాణ్ అని నమ్మి నాకు గుర్తుండిపోయే సినిమాను ఇచ్చిన దర్శకుడు వశిష్ఠకు థాంక్స్. కీరవాణి గారు నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశారు.’ అన్నారు.