పదోన్నతి పొందిన ఇంజినీర్లకు జెన్కో, ట్రాన్స్కో సీఎండీ సూచన
హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ట్రాన్స్కోలో చాలా కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఏఈలు 142 మంది ఏడీఈలుగా పదోన్నతి పొందడం సంతోషంగా ఉన్నదని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు పేర్కొన్నారు. పదోన్నతి పొందడం అంటే ఉన్నతస్థానానికి చేరుకోవడంగా భావించి.. మరింత బాధ్యతగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ అసిస్టెంట్ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో పదోన్నతి పొందిన ఇంజినీర్లు, గురువారం విద్యుత్తుసౌధలో సీఎండీని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి సీఎండీ అభినందనలు తెలిపారు. సీఎండీని కలిసినవారిలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి క్రాంతి, సతీశ్, వినయ్, రోషన్, నరేశ్, ఉపేందర్, ప్రణీత, స్వప్న, జయమ్మ, తిలక్ తదితరులు ఉన్నారు. మరోవైపు, సీఎండీకి టీఎస్ఈఏఈఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ అనిల్కుమార్ తదితరులు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.