పెద్దపల్లి : గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ సహృదయతను చాటుకున్నారు. లాక్ డౌన్ దృష్ట్యా వాహనాలు లేకపోవడంతో ఓ గర్భిణి గోదావరిఖని చౌరస్తా నుంచి మండు టెండలో నడుచుకుంటు వెళ్తున్నది. గమనించిన ఏసీపీ వన్ టౌన్ సీఐ రమేష్ బాబుకు చెప్పి తక్షణమే తన వాహనంలో ఇద్దరిని 8ఇంక్లిన్ కాలనీకి పంపించాలని సూచించారు.
పోలీస్ వాహనంలో గర్భిణికి తోడుగా మహిళా కానిస్టేబుల్ను సహాయంగా పంపి వారి గమ్యానికి చేర్చి తన సహృదయతను చాటుకున్నారు. మంచి మనసుతో గర్భిణికి సాయమందించిన ఏసీపీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్