శ్రీశైలం ఎడమగట్టు జెన్కో జలవిద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి
అమ్రాబాద్: విద్యుత్ శాఖను ప్రైవేటీకరణ చేసే అంశాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని శ్రీశైలం ఎడమగట్టు జెన్కో జల విద్యుత్ కేంద్రం చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఉద్యోగులతో కలిసి విద్యుత్ సౌధ ఎదుట ప్లకార్డుల తో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేందుకే అన్ని రంగాలను ప్రైవేటు చేసి జీఎస్టీ పేరుతో దోచుకుంటున్నదని ఇది ఆర్థిక మనుగడకు మంచిది కాదన్నారు.
ప్రజల పక్షాన కేంద్రం ఆలోచించి ప్రైవేటీకరణను రద్దుచేసి యువతకు విద్యా, ఉపాధి మార్గాలను చూపాలని ఆయన కోరా రు. కార్యక్రమంలో జెన్కో ఎడమగట్టు చీఫ్ ఇంజినీర్ రామసుబ్బారెడ్డి, ఎస్ఈలు సద్గుణ, రవీంద్రకుమార్ ఉద్యోగులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.