హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): నేషనల్ బయోడైవర్సిటీ ఏజెన్సీ (ఎన్బీఏ)కి చైర్మన్గా 1986 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి సీ అచలేందర్రెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. జనగామ జిల్లా యర్రగొల్లపహాడ్ గ్రామానికి చెందిన అచలేందర్రెడ్డి 34 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేశారు. నేషనల్ బయోడైవర్సిటీ చైర్మన్గా చెన్నైలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ఇప్పటివరకు ఎన్బీఏ కార్యదర్శిగా, నాన్ -అఫీషియల్ ఎక్స్పర్ట్ సభ్యుడిగా కొనసాగారు. పబ్లిక్ సిస్టమ్స్లో ఇన్నోవేషన్ సెంటర్ డైరెక్టర్గా పనిచేశారు. వివిధ విశ్వవిద్యాలయాలు, అకాడమీల్లో ఆల్ ఇండియా, గ్రూప్ సీ సర్వీస్ ఆఫీసర్లకు శిక్షణ ఇస్తున్నా రు. గోవాలో సముద్ర తాబేళ్ల రక్ష ణ కోసం చేసిన కృషికిగాను ఆయనకు ‘వైల్డ్ లైఫ్ సర్వీస్ రివార్డు’ లభించింది. అచలేందర్రెడ్డి ప్రతిపాదన మేరకు 1999లో గోవా ప్రభుత్వం తొలిసారి ఎకోటూరిజం విభాగాన్ని ప్రారంభించింది. ఆయన సిఫారసులతోనే 2012లో బయో డైవర్సిటీపై 11వ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో నిర్వహించారు. ఎన్బీఏలో నార్వేజియన్ ఏజెన్సీల సహకారంతో ‘సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ పాలసీ అండ్ లా’ స్థాపించడంలో అచలేందర్రెడ్డి కీలక పాత్ర పోషించారు.