న్యూఢిల్లీ: వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త గేమింగ్ ల్యాప్టాప్ను ఏసర్ ఇండియా లాంచ్ చేసింది. నివిడియా జీఫోర్స్ ఆర్టిఎక్స్ 3060 గ్రాఫిక్స్ కార్డుతో నైట్రో 5 గేమింగ్ ల్యాప్టాప్ను విడుదల చేసింది. భారత్లో దీని ధర రూ.89,999గా నిర్ణయించారు. యూజర్లకు అద్భుతమైన గేమింగ్ అనుభూతిని కలిగించేందుకు నైట్రో 5 టెన్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్తో వస్తోంది. ల్యాప్టాప్ 15.6 అంగుళాల ఫుల్హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే, ఆల్ట్రా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 144Hz హై రిఫ్రెష్ రేట్ కలిగింది. నైట్రో గేమింగ్ ల్యాప్టాప్ భారత మార్కెట్లో భారీ విజయాన్ని సాధించిందని ఏసర్ పేర్కొంది.