నిజామాబాద్ : జిల్లా కేంద్రంలో ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలేగడంతో స్థానికంగా కలకలం రేపింది. అందులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్డు సమీపంలో జరిగింది.
జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఓ వ్యక్తి తన వాహనంలో పొగలు రావడాన్ని గమనించి కారు ఆపి పక్కకు వెళ్లిపోయాడు. కొద్ది నిమిషాల్లోనే ఒక్కసారిగా మంటలు కారు మొత్తం వ్యాపించాయి.
మంటలు ఎగిసిపడి కారు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ మూలంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనంలో డ్రైవర్ తప్పా ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
ఇవి కూడా చదవండి..
భక్తులతో కిక్కిరిసిన ‘మల్లన్న’ క్షేత్రం
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి : మంత్రులు
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
నిజామాబాద్లో వృద్ధ దంపతుల ఆత్మహత్య