అమరావతి : కడప జిల్లాల్లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎక్స్కవేటర్, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన ముదిరెడ్డిపల్లి సమీపంలో చోటు చేసుకున్నది. గ్రామ సమీపంలో ఆటో, ఎక్స్కవేటర్ ఎదురెదురుగా వచ్చిన ఢీకొట్టుకున్నాయి. ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడ్డ ఇద్దరిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతులంతా రోజువారీ కూలీలని పోలీసులు పేర్కొన్నారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు.