అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్మాగారాల్లో తరుచు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో జరిగిన విషవాయువు లీక్ ఘటనలో సుమారు వంద మంది కార్మికులు అస్వస్థతను మరచిపోకముందే తూర్పు గోదావరి జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
జిల్లాలోని దేవరపల్లి మండలం బందపురం సమీపంలో ఉన్న పరమేశ్వర బయోటెక్ కర్మాగారం లో ఇవాళ ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు ఆక్సిజన్ అందక మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కర్మాగారంలోని బాయిలర్లో దిగి శుభ్రం చేస్తుండగా అస్వస్థతకు గురై చనిపోయారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సంబంధిత యాజమాన్యాన్ని అడిగి తెలుసుకుంటున్నారు.
అచ్యుతాపురం ఘటనపై ఏపీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించి కర్మాగారాల్లో వరుస ప్రమాదాలపై సీరియస్ అయ్యారు. కర్మాగారాల్లో సేఫ్టీ మేసర్స్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే తూర్పు గోదావరి జిల్లాలో మరో ప్రమాదం జరగడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుంది.