హైదరాబాద్ : పదోన్నతి ఉత్తర్వులు కావాలంటే.. తనకు లంచం ఇవ్వాల్సిందేనని అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారి డిమాండ్ చేశారు. దీంతో బాధిత ఉద్యోగిని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం లంచం తీసుకుంటున్న ఆ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఖైరతాబాద్లోని తెలంగాణ గవర్నమెంట్ టెక్ట్స్ బుక్ ప్రెస్ అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న టీ నరేశ్ కుమార్.. ప్రస్తుతం ఇంచార్జి డైరెక్టర్గా కొనసాగుతున్నారు. రామంతాపూర్లోని జిల్లా టెక్ట్స్ బుక్ సేల్ ఆఫీసులో మేనేజర్గా పని చేస్తున్న సిల్వేరు భారతి తన పదోన్నతి సంబంధించిన విషయంపై నరేశ్ కుమార్ను సంప్రదించారు. అయితే పదోన్నతికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయాలంటే.. తనకు రూ. 10 వేలు లంచం ఇవ్వాలని నరేశ్ డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇక గురువారం భారతి.. నరేశ్కు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.