మన్సూరాబాద్, అక్టోబర్ 13: లంచం తీసుకుంటూ బుధవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాగోల్-బండ్లగూడ ఎలక్ట్రికల్ ఏఈ.. ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. నాగోల్ రాక్టౌన్ కాలనీకి చెందిన ఆనంద్కుమార్ ఓ భవనాన్ని నిర్మించారు. కరెం ట్ మీటర్లతోపాటు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసేందుకు ప్రదీప్కుమార్రెడ్డి అనే వ్యక్తికి కాం ట్రాక్ట్ ఇచ్చారు. పని పూర్తిచేసిన ప్రదీప్కుమార్రెడ్డి వర్క్ కంప్లీషన్ రిపోర్ట్ కోసం నాగోల్, బండ్లగూడ ఎలక్ట్రికల్ ఏఈ భూక్య మధుకర్ను సంప్రదించగా రూ.15 వేలు డిమాండ్ చేశాడు. బుధవారం ఉదయం కాంట్రాక్టర్ ప్రదీప్కుమార్రెడ్డి నుంచి ఏఈ భూక్య మధుకర్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ములకలపల్లి, అక్టోబర్ 13: భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా ములకలపల్లి మండలానికి చెందిన రెవెన్యూ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం ప్రకారం.. ములకలపల్లి మండలంలోని పొగళ్లపల్లికి చెందిన సాధం శ్రీనివాస్ గత నెల 17న తనతోపాటు కుమార్తె కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. సర్టిఫికెట్ కోసం శ్రీనివాస్ రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి జూనియర్ అసిస్టెంట్ రవీంద్రరావును కలిశారు. సర్టిఫికెట్ ఇప్పించేందుకు జూనియర్ అసిస్టెంట్ రూ.20 వేల లంచం అడిగాడు. చివరకు రూ.12 వేలకు అంగీకరించాడు. బుధవారం జూనియర్ అసిస్టెంట్ రవీంద్రరావు రూ.6 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.