హైదరాబాద్ : కరోనా సమయంలో తెలంగాణలోని పేదప్రజల కోసం చేసిన సేవలకు గుర్తింపుగా టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు నాగేందర్ రెడ్డికి అభిస్టి సేవా పురస్కార అవార్డు దక్కింది. ఈ అవార్డును అభిస్తి సంస్థ తమ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా సభ్యులు, విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలు సాయం చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటారన్నారు. సమయానికి పేద ప్రజలకు భోజనాన్ని అందించిన బాగీస్ ఫుడ్ సర్వీసెస్, టీ కేఫ్ ల అధినేత కోటేశ్వర బాగీకి, తమను గుర్తించి ప్రోత్సహించిన అభిస్టి వెల్ఫేర్ సొసైటీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.