అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘నీతో’. బాలు శర్మ దర్శకుడు. ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహాల్ నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రం నుండి ‘లలనా మధుర కలనా’అనే లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. దర్శకుడు మాట్లాడుతూ ‘ ఇటీవల విడుదలైన ట్రైలర్తో పాటు విడుదల చేసిన పాటకు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్.