అమరావతి: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కోరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాఅబ్దుల్ కలామ్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్దుల్ కలామ్ చిత్ర పటానికి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నివాళులు అర్పించారు.
అచ్చెన్నాయుడు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి శాస్త్రవేతతగా భారతదేశ గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లిన ఘనత అబ్దుల్ కలామ్కే దక్కుతుందని కొనియాడారు. అంతరిక్షా ప్రయోగాలు , అణుబాంబు టెక్నాలజీలో దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని ప్రశంసించారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా అబ్దుల్ కలామ్ సేవలు దేశానికి అవసరమని గుర్తించి రాష్ట్రపతిని చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు