మహబూబ్ నగర్ : రాష్ట్రంలోని అర్హులందరికి ఆసరా పెన్షన్లు అందిస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నూతంగా మంజూరైన ఆసరా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గడచిన 70 సంవత్సరాలుగా ప్రజలు తాగునీటికి, విద్యుత్ కు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కేవలం 200 రూపాయల పెన్షన్ తో నెట్టుకొచ్చారన్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016 రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 7,436 మందికి నెల నెలా 32 లక్షల రూపాయల పెన్షన్ ఇచ్చే వారని, ఇప్పుడు 13,029 మందికి 8 కోట్ల 63 లక్షల రూపాయలు నెలకు పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఎదిర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇంకా పింఛన్ రాకుండా మిగిలిపోయిన వారిని గుర్తించి మళ్లీ పెన్షన్లు ఇస్తామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, మున్సిపల్ చైర్మన్ కె సి నర్సింహులు, వార్డు కౌన్సిలర్ యాదమ్మ, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ ఇంజినీర్ సుబ్రహ్మణ్యం, తదితరులు పాల్గొన్నారు.