రాజన్న సిరిసిల్ల : అర్హులైన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లను అందిస్తోంది. పార్టీలకు అతీతంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేత తక్కళ్ల రాములు (60) రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందిస్తున్న ఆసరా పెన్షన్కు దరఖాస్తు చేసుకోగా మంజూరైంది. ఈ మేరకు శనివారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఆసరా పింఛన్ గుర్తింపు కార్డుతో పాటు పత్రాన్ని కాంగ్రెస్ నేత రాములుకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, పడిగెల రాజు, పార్టీ నేతలు అందజేశారు. ఇటీవల రాములు కూతురికి కూడా కల్యాణ లక్ష్మి చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాములు కృతజ్ఞతలు తెలిపారు.