భారత్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో ఓటమి అనంతరం ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ జోకులు పేల్చాడు. ఈ మ్యాచ్లో తను కూడా ఫామ్ అందుకున్న ఫించ్.. 54 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ తనకు సంతృప్తినిచ్చిందని, కానీ జట్టును గెలుపు గీత దాటించి ఉంటే మరింత సంతోషంగా ఉండేదని చెప్పాడీ కంగారూల సారధి.
ఈ మ్యాచ్ ఛేజింగ్ సమయంలో విజయం కంగారూలకే దక్కుతుందని అంతా అనుకున్నారు. అయితే అద్భుతమైన ఫీల్డింగ్, సూపర్ బౌలింగ్తో భారత జట్టు విజయాన్ని తన సొంతం చేసుకుంది. దీనిపై మాట్లాడిన ఫించ్.. ‘నా ఇన్నింగ్స్ సంతోషాన్నిచ్చింది. కొన్ని మంచి పరుగులు చేశాననే భావన కలిగింది. గెలుపు గీత దాటి ఉంటే ఇంకా ఆనందంగా ఉండేది. అయినా వార్మప్ మ్యాచుల్లో వరల్డ్ కప్ కొట్టలేం కదా’ అని జోక్ చేశాడు. ఈ సమాధానం విన్న విలేకరులు కూడా చిన్నగా నవ్వేశారు.