హైదరాబాద్ , జూన్ 6: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తమ నెట్వర్క్ను విస్తరించడం ద్వారా ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలనుకునే వేలాది మంది విద్యార్థులు కలలను సాకారం చేయాలనే లక్ష్యానికనుగుణంగా దేశంలో అగ్రగామి టెస్ట్ ప్రిపరేషన్ సేవల సంస్థ ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్) తమ మొట్టమొదటి సమాచార కేంద్రాన్ని తెలంగాణా రాష్ట్రం మంచిర్యాలలో ప్రారంభించింది. ఈ సమాచార కేంద్రం వద్ద ఆకాష్కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అందించే కోర్సులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారమూ పొందవచ్చు. ఆకాష్ వద్ద విద్యార్థులు ఇప్పుడు వైద్య, ఇంజినీరింగ్ కోర్సులతో పాటుగా ఫౌండేషన్ స్థాయి కోర్సులను ఎంచుకోవచ్చు.
ఈ నూతన సమాచార కేంద్రాన్ని వర్ట్యువల్గా సందీప్ ధామ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ,అనూప్ అగర్వాల్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ , ధీరజ్ మిశ్రా, రీజనల్ డైరెక్టర్–ఏఈఎస్ఎల్ ప్రారంభించగా, మంచిర్యాలలో రవికిరణ్, బ్రాంచ్ మేనేజర్, ఆకాష్ ఇనిస్టిట్యూట్, కరీంనగర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ అధికారులు, ఫ్యాకల్టీ, అతిథులు పాల్గొన్నారు.
‘ఐఐటీయన్లు, డాక్టర్లుగా మారాలని ఆశిస్తోన్న స్థానిక విద్యార్థులకు ఈ కేంద్రం ఓ వరంగా మారనుందని ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ చౌదరి అన్నారు. దేశవ్యాప్తంగా తమ నాణ్యమైన బోధన ద్వారా అన్ని ప్రాంతాలకూ చేరువయ్యామని, ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్లకు ఎంపికైన తమ విద్యార్థులే దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.