ఆది సాయికుమార్, పాయల్ రాజ్పుత్ జంటగా నటిస్తున్న సినిమా ‘తీస్ మార్ ఖాన్’. సునీల్, పూర్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మాత. కళ్యాణ్ జి గోగణ దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానుంది. చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్లో ‘మా అమ్మను తప్పుగా చూశారు. మా అమ్మ జోలికి వస్తే ఏ అమ్మ కొడుకునైనా కొడతాను..’వంటి పవర్ఫుల్ డైలాగ్స్ చూపించారు. దర్శకుడు మాట్లాడుతూ..‘యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఆది సాయికుమార్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు.
మూడు డిఫరెంట్ షేడ్స్లో ఆయన ఆకట్టుకుంటారు. ట్రైలర్కు మంచి స్పందన వస్తున్నది. సినిమాకూ ఇదే రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం’ అన్నారు. అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్, అర్జున్ అంబటి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మణికాంత్, సంగీతం : సాయి కార్తీక్.