తిరుపతి : ఓ బెంజ్ కారు.. బైపాస్ రహదారిపై అతి వేగంతో దూసుకెళ్తోంది. అదే రహదారిలో రాంగ్ రూట్లో ట్రాక్టర్ వస్తోంది. యూటర్న్ తీసుకునేందుకు ట్రాక్టర్ డ్రైవర్ యత్నిస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన బెంజ్ కారు ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ఇంజిన్ రెండు ముక్కలైంది. ట్రాలీ మరో పక్కన పడిపోయింది. బెంజ్ కారు ఎడమ భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటన రేణిగుంట – చిత్తూరు బైపాస్ రహదారిపై మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రేణిగుంట – చిత్తూరు బైపాస్పై KA 04 MU 3456 నంబర్ గల బెంజ్ కారు తిరుపతి నుంచి చిత్తూరు వైపునకు వేగంగా వెళ్తుంది. అదే రహదారిపై యూ టర్న్ తీసుకునేందుకు రాంగ్ రూట్లో వస్తున్న ట్రాక్టర్ను మెర్సిడెస్ బెంజ్ కారు అతి వేగంతో ఢీకొట్టింది. ట్రాక్టర్ ఇంజిన్ రెండు భాగాలుగా విడిపోవడం, ట్రాలీ మరో పక్కన పడిపోయాయి. స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ ట్రాక్టర్ డ్రైవర్ను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. కారు కేవలం ఎడమ వైపు భాగం మాత్రమే దెబ్బతిన్నది.
బెంజ్ కారు గుద్దితే ట్రాక్టర్ రెండు ముక్కలైంది ..తిరుపతి సమీపంలోచంద్రగిరి బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది..రాంగ్ రూట్ లో ట్రాక్టర్ రావడం తో ఈ ప్రమాదం జరిగింది.. స్వల్ప గాయాతో ట్రాక్టర్ డ్రైవర్ బయటపడితే బెంజ్ కారులో ఉన్నోళ్లు క్షేమం pic.twitter.com/sh7LM5sBta
— Ch Sushil Rao (@sushilrTOI) September 26, 2022