నర్సాపూర్ రూరల్/మెదక్ : డ్రైవర్ లేకుండానే ఓ ట్రాక్టర్ బైకులపై దుసుకెళ్లడం స్థానికంగా కలకలం రేపింది. ఈ విచిత్రమైన సంఘటన జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేట్ గ్రామానికి చెందిన రమేష్ తన ట్రాక్టర్ను సర్వీసింగ్ చేయించి మెదక్ మార్గంలో గల ఓ వైన్స్ షాప్ సమీపంలో పార్క్ చేశాడు. కంగారులో డ్రైవర్ ఇంజిన్ ఆఫ్ చేయకుండానే పక్కనున్న దుకాణంలోకి వెళ్లాడు.
ఇంతలో ట్రాక్టర్ ఉన్నట్టుండి ముందుకు వెళ్లి రోడ్డు పక్కన ఉన్న బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమవ్వగా మరో పది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అక్కడ ఉన్న ప్రయాణికులు స్పందించి బ్రేకులు వేసి ట్రాక్టర్ను ఆపారు. ఆ సమయంలో అక్కడ జనం ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
Tokyo Olympics : బాక్సర్ లవ్లీనా గ్రామంలో సంబురాలు
Rashmi Gautam: లంగా ఓణీలో హీటెక్కిస్తున్న యాంకర్ రష్మీ