సూర్యాపేట : ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం లభించింది. స్వరాష్ట్రంలో సుపరిపాలన అన్నది నిరూపణ జరిగింది. అందుకు కృషి చేసిన విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని కోదాడ పట్టణ వాసులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. వివరాలల్లోకి వెళ్తే.. 60 ఏండ్ల కిందట విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన 33 kv విద్యుత్ వైర్లు కాలక్రమేణా విస్తరించడంతో కోదాడ పట్టణ ప్రజలకు ప్రమాదకరంగా పరిణమించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే విషయాన్ని అప్పటి ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు అప్పటి పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. దాంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి జరిగిన ఎన్నికల్లో కోదాడ నుంచి ఎన్నికయిన స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన ఆయన సంబంధిత శాఖ మంత్రి జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
విషయాన్ని అర్థం చేసుకున్న మంత్రి 33kv వైర్లతో 240 కి పై కుటుంబాలు అవస్థలు పడుతున్నారని తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. వారితో నివేదిక తెప్పించుకున్న మంత్రి అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మంత్రి ఆదేశానుసారం డీఎంఎఫ్టీ నిధులు విడుదల చేయడంతో రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది ఆఘమేఘాల మీద విద్యుత్ వైర్లను తొలగించారు.
60 ఏండ్లుగా ఇబ్బంది పడుతున్న వైర్ల ప్రమాదం విషయం తెలియంగానే స్పందించి తొలగించిన మంత్రి కి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. పట్టణ ప్రజలు మంత్రి జగదీష్ రెడ్డి అందించిన సహకారాన్ని కొనియాడారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
ఇసుక ట్రాక్టర్ ఢీ కొని వ్యక్తి మృతి
పార్లమెంట్ ముందు ఆందోళనకు భారీగా తరలివచ్చిన రైతులు..!
గ్రామాల అభివృద్ధి బాధ్యత మీదే : మంత్రి హరీశ్రావు