నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సొంత జిల్లా నిజామాబాద్లో ఘన స్వాగతం లభించింది. ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు టీఆర్ఎస్ శ్రేణులు ఇందల్ వాయి టోల్ గేట్ వద్ద నుంచి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. భారీ గజమాలతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం చెందిన ప్రజలు, కార్యకర్తలు అభిమానం చాటుకున్నారు.