రంగారెడ్డి : అత్తవారింటి వేధింపులు తట్టుకోలేక ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లి గ్రామానికి చెందిన అవ్వారి రాజశేఖర్(32) ఇబ్రహీంపట్నం సమీపంలోని గురునానక్ ఇంజినీరింగ్ కళాశాలలో ల్యాబ్ ప్యాకల్టీగా పనిచేస్తున్నాడు.
రాజశేఖర్కు గత ఆరు సంవత్సరాల క్రితం మెహదీపట్నంకు చెందిన కన్యాకుమారితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. అయితే గతకొన్ని రోజులుగా భార్యభర్తల మధ్య గొడవల కారణంగా రాజశేఖర్ భార్య తన తల్లిగారి ఇంటివద్దనే ఉంటుంది. దీంతో మనస్థాపానికి గురైన రాజశేఖర్ గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, మృతుడి చిన్నబామ్మర్ది నర్సింహ, పెద్దబామ్మర్ది శేఖర్, అత్త శారదల వేధింపులు తట్టుకోలేకే చనిపోతున్నట్లు సూసైడ్నోట్ రాసి తన షర్ట్జేబులో పెట్టుకుని చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు తండ్రి మల్లేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు
అశ్రు నయనాలతో చందూలాల్కు అంతిమ వీడ్కోలు
మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరికలు