లైవ్ రిపోర్టింగ్ అంటే ఆషామాషీ కాదు. రిపోర్టర్లు అనేకసార్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయినా, కొందరు పాత్రికేయులు వెనుకడుగు వేయరు. వార్తలను ఉన్నది ఉన్నట్టు చూపించేందుకు ఎంతదాకైనా వెళ్తారు. ఈ వీడియో ఆ కోవకు చెందినదే. ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ మెడలోతు నీటిలో వరదలను కవరేజ్ చేస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘అనురాగ్ అమితాబ్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో దేశంలోని వరదల పరిస్థితిని రిపోర్ట్ చేసేందుకు ఓ టీవీ జర్నలిస్టు మెడలోతు నీటిలో నిల్చున్నాడు. అతడి శరీరం మొత్తం నీటిలో మునిగి ఉంది. తల, మైక్ మాత్రమే వీడియోలో కనిపిస్తున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు రిపోర్టర్ అంకితభావాన్ని, పని తీరును ప్రశంసించారు. రిపోర్టర్ను ప్రమాదంలో పడేసినందుకు న్యూస్ చానెల్ను కొందరు విమర్శించారు. ‘అత్యంత కఠిన పరిస్థితుల్లో రిపోర్టింగ్ చేసినందుకు మీకు హ్యాట్సాఫ్ సార్’ అంటూ కామెంట్ చేశారు.
Dangerous,deadly,killer #Pakistani #Reporting..
There is #FloodinPakistan and news channels,army and #ImranKhan too
All 4 become uncontrollable,can do anything..#PakistanFloods #PakArmy #flood pic.twitter.com/aI5KeRsiwL
— Anurag Amitabhانوراگ امیتابھअनुराग अमिताभ (@anuragamitabh) August 27, 2022