సికింద్రాబాద్ : రెండు బస్సుల మధ్య చిక్కుకుని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ విషాద సంఘటన సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధి రతీఫైల్ బస్టాండ్లో చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బస్స్టాప్లో బస్సు కోసం ఎదురుచూస్తున్నాడు. బస్సు ఎక్కే క్రమంలో రెండు బస్సుల మధ్య చిక్కుకుపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపలే బాధితుడు మృతిచెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.