హైదరాబాద్ : ఓ వ్యక్తి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్లను పట్టుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మలక్పేట సైదాబాద్లోని అక్బర్ బాగ్ కాలనీలో సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దిల్కుషా ఫంక్షన్ హాలు సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఈ దారుణానికి పాల్పడ్డాడు. మృతుడు ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు మద్యానికి బానిసై.. డబ్బుల కోసం భార్యతో గొడవ పడిన అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.