వరంగల్ : ప్రమాదవశాత్తు ఈదుల చెరువు వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుగ్గొండి మండలం నాచినపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రెడ్డి వెంకట్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. కాగా, భారీ వర్షానికి నాచినపల్లి- దుగ్గొండి గ్రామాల మధ్య ఉన్న ఈదుల చెరువు మత్తడి దుంకుతున్నది. వెంకట్ రెడ్డి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు.
స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వెంటనే సంఘన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.