క్రైస్ట్చర్చ్: ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బంగ్లా 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు చేసింది. నజ్ముల్ హసన్ (33) టాప్ స్కోరర్ కాగా.. కివీస్ బౌలర్లలో బౌల్ట్, సౌథీ, బ్రాస్వెల్, సోధీ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం చేజింగ్లో న్యూజిలాండ్ 17.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది. కాన్వే (51 బంతుల్లో 70; 7 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.