కులకచర్ల, ఆగస్టు 15: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో శిఖరాన్ని వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం ఘనాపూర్కు చెందిన నవీన్కుమార్ అధిరోహించారు.
సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కిలిమంజారో శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తనకు సహకరించిన దాతల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 10న నవీన్కుమార్ కిలిమంజారో పర్వతం వద్దకు చేరుకొని 5 రోజుల్లోనే శిఖరాన్ని అధిరోహించారు.