గుండాల, అక్టోబర్ 4 : యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని రామారం గ్రామ పరిధిలో మంగళవారం కెమెరా డ్రోన్ కూలింది. రామారం గ్రామానికి చెందిన దొడ్డబోయిన ముత్యాలు, సమీప రైతులు గుండ్లపెల్లి రాంరెడ్డి, మన్నె యాకస్వామి తమ వ్యవసాయ భూమిలో పశువులను మేపుతుండగా.. సమీపంలో పెద్ద శబ్దం చేస్తూ డ్రోన్ కూలింది. దీంతో రైతులు భయంతో పరుగులు తీశారు. ఆ డ్రోన్ తమదేనంటూ గుండాల మండలం పాచిల్ల గ్రామంలోని ఎంజేఆర్ ఫామ్స్ నిర్వాహకులు తీసుకెళ్లారు. వారిని రైతులు ప్రశ్నించగా.. రక్షణ శాఖ కోసం డ్రోన్లు తయారు చేస్తున్నామని, పూర్తి వివరాలు చెప్పకూడదని అన్నారు. డ్రోన్ల తయారీకి సంబంధించిన సమాచారం తమకు లేదని స్థానిక ఎస్సై యాకన్న తెలిపారు.