అమరావతి : చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామకృష్ణాపురం పంచాయతీ రాజా ఇండ్లు గ్రామానికి చెందిన రైతు రత్నంనాయుడు తహసీల్దార్ కార్యాలయంలో గుండెపోటుతో మరణించిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటన తన మనసును కలచివేసిందని ట్విటర్ లో పేర్నొన్నారు. రైతు మృతిపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
వైసీపీ నేతల స్వార్థానికి ఇంకెంత మంది సామాన్యులు బలికావాలని ప్రశ్నించారు. న్యాయస్థానం పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చాక కూడా ప్రభుత్వం ఆయనకు న్యాయం చేయలేకపోవడం దురదృష్టకరమని తెలిపారు. రత్నం నాయుడు మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.