హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొత్తపల్లి వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ఉన్నారు. ఇందులో ముగ్గురు వ్యక్తులు కారులో నుంచి బయటపడగా.. మరో వ్యక్తి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ క్రమంలో ఓ చెట్టుకొమ్మను పట్టుకోగా స్థానికులు సదరు వ్యక్తిని కాపాడారు. చేవేళ్ల మండలం ఏనికేపల్లి నుంచి కౌకుంట్ల వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. చేవేళ్ల, శంకర్పల్లి మండలాల్లో భారీ వర్షాలకు ఈసీ, మూసీ నదులు ఉప్పొంగుతున్నాయి. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.