గోవాలో విషాదం నెలకొంది. ఓ కారును ఓవర్టేక్ చేయబోయి ఎస్యూవీ.. బ్రిడ్జి రేలింగ్పైనుంచి నదిలో పడిపోయింది. డ్రైవర్తో సహా ఆ ఎస్యూవీలో ఉన్నవారందరూ మృతిచెంది ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. ఆ రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదస్థలాన్ని వీడియో చిత్రీకరించాడు. ఇది ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్టాలిమ్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఉన్న జువారీ నది వంతెనపై కారును ఓవర్టేక్ చేసేందుకు ఎస్యూవీ ప్రయత్నించింది. అదుపుతప్పడంతో అది వంతెన రెయిలింగ్లను ఢీకొని నదిలో పడిపోయింది. గోవా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, భారత నావికాదళానికి చెందిన డైవర్లు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. వాహనంలో కనీసం నలుగురు వ్యక్తులున్నారు. ఆ ఎస్యూవీని ఓ మహిళ నడుపుతున్నది. ఈ వంతెన మార్గోవ్ (దక్షిణ గోవా), పనాజీ నగరాల మధ్య జాతీయ రహదారిపై ఉంది. జువారీ వంతెన ఉత్తర , దక్షిణ గోవాల మధ్య ఒక ముఖ్యమైన కనెక్టర్.
#ZuariAccidentUpdate|| This was the scene last night on #Zuari Bridge after the SUV plunged in River. This video is shot by one of the person who crossed the bridge last night. pic.twitter.com/UQmm3F1sGK
— Goa News Hub (@goanewshub) July 28, 2022