అమరావతి : అతివేగంతో వచ్చిన ఓ కారు వంతెన నుంచి కిందపడిన ఘటనలో మహిళ మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా వరికుంటపాడు కోల్డ్ స్టోరేజ్ వద్ద పై వంతెన నుంచి కారు కింద పడింది . ఈ ప్రమాద సమయంలో పామూరుకు చెందిన వెంకటలక్ష్మమ్మ కారులోనే మృతి చెందగా డ్రైవర్తో పాటు మరో యువతికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ సహా ముగ్గురు ఉన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.