రఘునాథపల్లి: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి రఘునాథపల్లి మండల కేంద్రంలో పోలీసు వాహనాన్ని మరో వాహనం ఢీకొట్టింది. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పింది. గ్రామస్థుల కథనం ప్రకారం మండల కేంద్రంలోని ఖిలాశపురం క్రాస్ రోడ్డులో గల వాటర్ ప్లాంట్ వద్ద వరంగల్ నుంచి జనగాం వెళ్తున్న ఓ వాహనం అతివేగంతో వచ్చి పోలీసు వాహనాన్ని ఢీకొన్నది. పోలీస్ సిబ్బంది అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పింది. ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్ చేసి పోలీసు వాహనాన్ని ఢీకొట్టినట్లు తెలిసింది.