ఆదిలాబాద్ : శివరాత్రి పర్వదినం.. ఆ బాలుడి ఇంట్లో విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా భోకర్ తాంసి గ్రామానికి చెందిన విఠల్ కుమారుడు విపుల్ (15) ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ముత్నూర్ గ్రామంలో మేనమామ ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చాడు. శివరాత్రి సందర్భంగా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ గ్రామంలోని మల్లికార్జునాలయానికి మేనమామ, విపుల్ బైక్ పై బయల్దేరారు. ఇచ్చోడ జాతీయ రహదారి ఆదిలాబాద్ బైపాస్ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ(టీఎన్52 కే 8488) బైక్ను ఢీకొట్టింది. దీంతో విపుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. మేనమామ విలాస్(36) స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్ఐ సూర్యప్రకాశ్ తెలిపారు.