ముంబై : మహారాష్ర్టలోని నలాస్పూరా వెస్ట్లో విషాదం నెలకొంది. కొవిడ్ వ్యాక్సిన్ కోసం తన పేరును రిజిస్ర్టేషన్ చేయించుకునేందుకు క్యూలైన్లో నిల్చున్న ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మార్చి 12వ తేదీన చోటు చేసుకుంది. మృతుడిని హరీష్ భాయి పంచాల్(63)గా గుర్తించామని మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేఖ వాల్కే తెలిపారు. మహారాష్ర్ట వ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతున్న విషయం విదితమే. గత కొద్ది రోజుల నుంచి రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్నారు. ఈ నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను పెంచారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా ముమ్మరం చేశారు.