అమరావతి : ఏపీలో కరోనా విజృంభిస్తున్నది. రోజురోజుకూ వైరస్ ఉధృతి క్రమంగా పెరుగుతున్నది. పాజిటివ్ కేసులు వందల్లో పెరుగుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 306 మంది చికిత్సకు కోలుకున్నారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 8,96,863కు చేరింది. 8,85,515 మంది చికిత్సకు కోలుకున్నారు. 4145 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు 7203 మంది ప్రాణాలు కోల్పోయారు.