పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామమైందని, టీఎస్ఐపాస్తో 15రోజుల్లో అనుమతులొస్తున్నాయని ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కంపెనీ ఏర్పాటు చేసే ప్రాంతాల్లో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తున్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కేసీతండాలో నిర్మించిన విప్రో కన్జ్యూమర్ కేర్అండ్ లైటనింగ్ ఫ్యాక్టరీని విప్రో గ్రూప్ చైర్మన్ అజీమ్ప్రేమ్జీతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు.