నిజామాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 86,270 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ నయనారెడ్డి తెలిపారు. ప్రాజెక్టు 18 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి 74,952 క్యూసెక్కుల మిగులు జలాలను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1087.60 అడుగుల (75.145 టీఎంసీలు) నీటి నిల్వ ఉందన్నారు.