అమరావతి : ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 839 కరోనా కేసులు, 8 మరణాలు నమోదయ్యాయి. మహమ్మారి నుంచి మరో 1,142 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,388 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. తాజా కేసులతో కలిసి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 20,39,529కు చేరాయి. మొత్తం 20,11,063 మంది బాధితులు కోలుకోగా.. వైరస్తో 14,078 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో 42,679 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కొవిడ్తో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో జిల్లాలో 231, నెల్లూరు జిల్లాలో 149, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో 101 చొప్పున అత్యధికంగా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి.