స్టాక్హోం: భారత్కు పది లక్షల డోసుల ఆస్ట్రజెనెకా టీకాలను విరాళంగా ఇవ్వాలని స్వీడన్ నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి చేపట్టిన కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా వీటిని పంపిణీ చేస్తారు. పేదదేశాలకు రోనా వ్యాక్సిన్ అందేలా చూసేందుకు సమితి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ టీకాల విరాళం గురించి స్వీడన్ అంతర్జాతీయ సహకార మంత్రి పెర్ ఓల్సన్ ఫ్రిధ్ ఎస్వీటీ ఒక టెలివిజన్ కార్యక్రమంలో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ప్రజలు మరణిస్తున్నారని, పేదరికం విస్తరిస్తున్నదని, పిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మహమ్మారిని అంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా సర్వశక్తులు వినియోగించి పోరాడాల్సి ఉందని స్వీడన్ మంత్రి అన్నారు.