కోల్కతా: బెంగాల్ లో పరిస్థితి చేజారుతున్నదని గవర్నర్ జగదీప్ ధంకర్ అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల చెలరేగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆయన డీజీపి తదితర పోలీసు ఉన్నతాధికారులను రాజ్భవన్కు పిలిపించుకుని చర్చించారు. హింసాకాండ కట్టడికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆదివారం నుంచి జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో తమ కార్యకర్తలు ఐదుగురు చనిపోయారని బెంగాల్ బీజేపీ ఆరోపించింది. తమ కార్యకర్తలపై ఆస్తులపై కూడా దాడులు జరుగుతున్నాయని అంటున్నది. మరోవైపు తృణమూల్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ శాంతియుతంగా ఉండాలని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెంగాల్ బయట, అదీ ఇదివరకెప్పుడో జరిగిన ఘటనల ఫొటోలతో బీజేపీ అసత్యప్రచారం జరుపుతున్నదని ఆమె ఆరోపించారు.