కాబూల్ : అఫ్ఘనిస్తాన్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో పెద్ద ఎత్తున తాలిబాన్ ఉగ్రవాదులు మరణించారు. గత 24 గంటల్లో 80 మంది తాలిబాన్లు చనిపోయినట్లు, మరో 60 మంది గాయపడినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దేశవ్యాప్తంగా భద్రతా దళాలు-తాలిబాన్ల మధ్య తీవ్ర పోరాటం జరుగుతున్నది. భద్రతా దళాలకు సహాయపడటానికి వైమానిక దళం ఆపరేషన్ కూడా కొనసాగుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. తాలిబాన్లపై ఎదురుదాడి దిగేందుకు వైమానిక దళం ఘజ్ని, లోగర్, జాబుల్, హెరాత్, ఫరా, హెల్మాండ్, బాగ్లాన్లలో దాడులు చేపట్టింది.
రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, తాలిబాన్ ఉగ్రవాదులు 115 ప్రదేశాల్లో ల్యాండ్మైన్లను పెట్టారు. పెద్ద సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అఫ్ఘన్ భద్రతా దళాలు బాగ్లాన్లో ఉగ్రవాదులకు తీవ్ర నష్టం కలిగించాయి. బాంబు దాడిలో కాబూల్లోని పవర్హౌస్కు అనుసంధానించబడిన నెట్వర్క్ దెబ్బతిన్నది. దాంతో కాబూల్ రాత్రంతా చీకట్లో గడపాల్సి వచ్చింది. గతంలో విద్యుత్ నెట్వర్క్ను దెబ్బతీసే ప్రయత్నాలు కూడా జరిగాయి.
మే 1 నుంచి అఫ్ఘనిస్తాన్లో అమెరికా, నాటో దళాలపై ఎలాంటి దాడి జరగలేదని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ మార్క్ మిలే తెలిపారు. రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో జరిపిన సంభాషణలో ఆయన ఈ సమాచారం ఇచ్చారు. సైన్యం ఉపసంహరించుకున్న తర్వాత కూడా అఫ్ఘన్ సైన్యం సమాన మద్దతును కొనసాగిస్తుందని ఆయన చెప్పారు. అన్ని దళాలు సెప్టెంబర్ 11 నాటికి అఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్లిపోతాయి.
భారత్ నుంచి వచ్చే పౌరులపై మే 15 నుంచి ఆస్ట్రేలియా నిషేధం ఎత్తివేత
భారత్కు 10 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను పంపిన ఐరాస
మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై దాడి.. పేలుడులో గాయాలు
కాలువలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు.. 671 వయల్స్ స్వాధీనం
టోక్యో ఒలింపిక్స్పై కరోనా పంజా: రద్దు చేయాలంటూ ప్రధానికి విజ్ఞప్తి
కెనడాలో కొత్త ఇమ్మిగ్రేషన్ విధానం.. భారతీయులకే ఎక్కువ ప్రయోజనం
కరెనా ఎఫెక్ట్ : విదేశాల్లో పెరిగిన భారతీయ విద్యార్థుల ఇబ్బందులు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..