వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల మండలంలో విద్యార్థులతో (Students) వెళ్తున్న ఆటో బోల్తాపడింది. మండలంలోని ముజాహిద్పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను పరిగి దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
విద్యార్థులు ముజాహిద్పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద సమయంలో ఆటోలో 20 మంది విద్యార్థున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.