న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కనుమరుగైన చీతాలు మళ్లీ భారత గడ్డపై సందడి చేయనున్నాయి. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో 8 చీతాలు మన దేశానికి రానున్నాయి. అందులో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి. వీటిని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో వదలనున్నారు.
ఆడ చీతాల వయసు 2-5 ఏండ్లు, మగ చీతాల వయసు 4.5-5.5 ఏండ్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. చీతాలను తీసుకొచ్చే విమానం ముందు భాగాన్ని పులి బొమ్మతో డిజైన్ చేశారు. నమీబియా నుంచి 16 గంటలు ప్రయాణించి చీతాలు భారత్లోని జైపూర్కు చేరుకొంటాయి. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కునో జాతీయ పార్కుకు తరలిస్తారు.