హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) లిమిటెడ్ వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు ఈనెల 18న ముగియనున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 75 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రిషన్, వెల్డర్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపికచేస్తున్నది.
మొత్తం ఖాళీలు: 75
ఇందులో ఫిట్టర్ ఫ్రెషర్ 20, ఎలక్ట్రిషన్ ఫ్రెషర్ 20, వెల్డర్ ఫ్రెషర్ 20, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ పాథాలజీ 10, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ రేడియాలజీ 5 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఇంటర్లో బయాలజీ లేదా సైన్స్ గ్రూప్ చేసి ఉండాలి. మిగిలిన పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులవాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 18
వెబ్సైట్: www.nlcindia.in