Repubic Day : గణతంత్ర దినోత్సవాల్లో ఈ సారి విమానాలు అందర్నీ ఆకర్షించనున్నాయి. 75 విమానాలతో ఫ్లై పాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నామని రక్షణ శాఖ పేర్కొంది. 75 విమానాలతో భవ్యమైన ఫ్లై పాస్ట్ చేస్తున్నామని, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ఇలా చేయలేదని, ఇలా ఫ్లై పాస్ట్ చేయడం ఇదే ప్రథమమని రక్షణ శాఖ అధికారులు ప్రకటించారు. అయితే ఈ 75 యుద్ధ విమానాల్లో పాత విమానాలు, కొత్త విమానాలు కూడా ఉంటాయని పేర్కొంది. సుఖోయ్, రాఫెల్, జాగ్వర్, ఎంఐ-17, సారంగ్, అపాచీ, డకోటాతో పాటు రాహత్, మేఘన, ఏకలవ్య, త్రిశూల్, తిరంగా, విజయ్, అమృత్ లాంటి వాటిని కూడా ప్రదర్శిస్తామని రక్షణ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే వీటిని వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రక్షణ రంగంలోని వివిధ కీలక ఘట్టాలు, షార్ట్ ఫిల్మ్లు, సాయుధ దళాలకు సంబంధించిన వీడియోలను కూడా చూపిస్తామని రక్షణ శాఖ పేర్కొంది.